
కడప: మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలే పార్టీకి ప్రాణశక్తి, గెలుపు వెనక కారణమని అభినందించారు. పార్టీలో మరణించిన వారికి, జవాన్లకు సంతాపం తెలిపారు. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
2024 ఎన్నికల్లో వచ్చిన ఘన విజయానికి కార్యకర్తల పోరాటమే మూలకారణమని అన్నారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లతో చరిత్ర సృష్టించామన్న ఆయన, జనసేన-బీజేపీ కూటమి తోడ్పాటును గుర్తు చేశారు. టీడీపీ జెండా ఎప్పటికీ రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ పాలకుల హత్యా రాజకీయాలను గుర్తు చేస్తూ, కార్యకర్తలు ఎదుర్కొన్న త్యాగాలను కొనియాడారు. చంద్రయ్య వంటి వీరుల త్యాగాలే కూటమిని అధికారంలోకి తీసుకువచ్చాయన్నారు. వారందరికీ తాను నమస్కరిస్తున్నానని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని వివరించారు. 2 రూపాయల బియ్యం నుంచి మహిళలకు ఆస్తి హక్కు వరకు తీసుకొచ్చిన నూతన పథకాలను గుర్తు చేశారు.
తాను నిత్య విద్యార్థినని, అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అక్రమాలను బహిర్గతం చేస్తామని, ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.