
న్యూస్ డెస్క్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈసారి అసెంబ్లీలో ఘాటైన వ్యాఖ్యలతో దుమారం రేపారు. సాధారణంగా పెద్దగా జోక్యం చేసుకోని ఆయన, ఈసారి మాత్రం గత ప్రభుత్వ వ్యవహారాలపై గట్టిగా స్పందించారు.
సినీ ప్రముఖులు మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిసిన అంశం చర్చలోకి రాగానే బాలయ్య మధ్యలోనే జోక్యం చేసుకుని స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సందర్భంలో ఎవరూ గట్టిగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆయన మాట్లాడుతూ ఆ సైకో గాడు అంటూ తీవ్ర పదజాలం వాడారు. అప్పట్లో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని అంగీకరించినప్పటికీ, చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని ప్రత్యేకంగా గుర్తుచేశారు.
తనను కూడా ఆ సమావేశానికి పిలిచినా, తాను హాజరుకాలేదని తెలిపారు. అదే సమయంలో తన పేరు జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తూ, వెంటనే మంత్రి దుర్గేశ్ను ప్రశ్నించానని చెప్పారు.
బాలయ్య వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది.
అసెంబ్లీలో కామినేని వ్యాఖ్యలను ప్రత్యక్షంగా ఖండించి, చిరంజీవి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసిన బాలయ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
