స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక సీనియర్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. జూన్ 17న బంగ్లాదేశ్తో గాలేలో జరగనున్న మ్యాచ్ అతడి చివరి టెస్ట్గా ఉండనుంది.
మాథ్యూస్ మాట్లాడుతూ, “ఇంకా వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉంటాను. కానీ టెస్ట్లకు యువ ఆటగాళ్లకు స్థానం ఇవ్వాలనుకుంటున్నాను” అని చెప్పారు. ఈ నిర్ణయం సెలక్టర్లకు ముందుగానే తెలియజేశారట.
17 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో మాథ్యూస్ 118 మ్యాచ్లు ఆడి 8,167 పరుగులు సాధించాడు. కెప్టెన్గా 34 టెస్టులు నడిపాడు. బౌలింగ్లోనూ సహకరించి 33 వికెట్లు తీసాడు.
“శ్రీలంక జట్టులో ప్రయాణం ఒక గౌరవం. బోర్డు, సహచరులు, అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు” అంటూ భావోద్వేగంతో రిటైర్మెంట్ ప్రకటించాడు.
గతంలో 2009లో ఆస్ట్రేలియాతో అరంగేట్రం చేసిన మాథ్యూస్, టెస్ట్ క్రికెట్కు గొప్ప సేవలందించి జట్టులో గుర్తించదగిన స్థానం సంపాదించాడు. ఈ రిటైర్మెంట్ నిర్ణయం వదిలినా, మాథ్యూస్ వారసత్వం చిరస్థాయిగా నిలుస్తుంది.