
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్పై కీలక సమయాల్లో ధైర్యంగా నిలిచిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు.
టాప్ ఆర్డర్ విఫలమైనా తిలక్ 53 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ జట్టుకు కప్ను అందించింది. ఈ ప్రదర్శనతో తిలక్ ఫ్యాన్స్ గర్వపడేలా చేశాడు.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ తన క్యాప్ను ఏపీ మంత్రి నారా లోకేశ్కి కానుకగా ఇచ్చాడు. “లోకేశ్ అన్నా ఇది నీకోసమే” అని రాసి సైన్ చేశాడు.
ఈ వీడియోను చూసిన లోకేశ్ ట్వీట్ చేస్తూ స్పందించాడు. “తమ్ముడూ… నీ అభిమానం నన్ను ముగ్ధుడ్ని చేసింది. నువ్వు ఛాంపియన్” అంటూ పేర్కొన్నాడు.
భారత జట్టు గెలుపు దసరా కానుకలా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తెలుగు ఆటగాళ్ల ప్రతిభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తిలక్ గిఫ్ట్ కథనం క్రీడాభిమానుల హృదయాలను తాకింది. లోకేశ్ స్పందన కూడా అభిమానుల్లో హర్షాన్ని కలిగించింది.
