Friday, July 4, 2025
HomeSportsభారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై మరో కన్ఫ్యూజన్

భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై మరో కన్ఫ్యూజన్

india-bangladesh-august-2025-tour-cancel-risk

న్యూస్ డెస్క్: ఆగస్టులో జరగాల్సిన భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పర్యటనకు అనుమతి ఇవ్వనప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ఆగస్టు 17 నుంచి ముగింపు వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉండగా, భద్రతపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆటగాళ్ల సురక్షతే మాకు ముఖ్యమని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయని చెబుతున్నారు.

బీసీసీఐ ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పర్యటన కొనసాగుతుందని స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలో బీసీసీఐ, బీసీబీ సంయుక్తంగా నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

ఇదిలా ఉండగా, సిరీస్‌పై క్లారిటీ లేకపోవడంతో బీసీబీ మీడియా హక్కుల బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. జులై 7, 10 తేదీల్లో జరగాల్సిన వేలం రద్దైంది.

ఆర్థికంగా ఈ పర్యటన బంగ్లాదేశ్ బోర్డుకు కీలకం కావడంతో, తటస్థ వేదికపై మ్యాచ్‌ల నిర్వహణపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌తో సిరీస్ మాదిరిగా ఈ ఎంపికపై బీసీబీ ఆలోచిస్తోంది.

ఇందుకు సంబంధించి అధికారిక స్పష్టత వచ్చే రెండు రోజుల్లో రావచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular