
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్కు ముహూర్తం కుదిరింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న కొత్త చిత్రం జూన్లో ప్రారంభం కానుంది.
ఈ మాస్, క్లాస్ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి గత సినిమాలకి భిన్నంగా, ఈసారి విజయ్ సేతుపతి స్టైల్కు తగ్గట్టుగా ఇంటెన్స్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం.
ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ వంటి భారీ నటులు కూడా కీలక పాత్రల్లో నటించనుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం పూరి, హైదరాబాద్ మరియు చెన్నై పరిసరాల్లో లొకేషన్స్ వెతుకుతున్నారని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ను అక్కడే ప్లాన్ చేస్తున్నారట.
విజయ్ సేతుపతి నటనలో ఉన్న లోతు, పూరి జగన్నాథ్ మాస్ టేకింగ్ కలయికలో ఈ సినిమా విభిన్నంగా ఉండబోతోంది. మాస్, ఇంటెన్స్ డ్రామాతో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ను పూరి తన ప్రొడక్షన్ హౌస్ ‘పూరి కనెక్ట్స్’పై ఛార్మి కౌర్తో కలిసి నిర్మిస్తున్నారు.