
టాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కిన శేఖర్ కమ్ముల దర్శకత్వ చిత్రం కుబేర విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై మంచి హైప్ను సృష్టించాయి.
ఈ క్రమంలో తాజాగా ధనుష్ తన ఇంటర్వ్యూలో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తమిళనాట నాగార్జున సినిమాలకు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉందని ధనుష్ తెలిపారు.
ఆయన వ్యక్తిగతంగా నాగ్ నటించిన రచ్చగన్ (తెలుగులో రక్షకుడు) సినిమాను ఎంతో ఇష్టపడతానని, అది తన ఆల్టైమ్ ఫేవరెట్ అని చెప్పాడు. ఈ సినిమా తన చిన్ననాటి గుర్తులలో ఒక ముఖ్యమైన భాగమని కూడా పేర్కొన్నాడు.
కుబేర షూటింగ్ సమయంలో నాగార్జునతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిగా ఉందని ధనుష్ తెలిపారు. “నాగ్ సర్ పక్కన నటించడం ఎంతో గౌరవంగా ఫీలయ్యా. ఆయన సన్నివేశాల సమయంలో నేను నెరవేరిన కలలా ఫీలయ్యాను” అంటూ ఉద్వేగంగా స్పందించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇద్దరు స్టార్ యాక్టర్ల కాంబోలో వస్తున్న కుబేరపై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.