
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ మాస్ ఎంటర్టైనర్తో రీటర్న్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి విఫల ప్రయోగాల తర్వాత విజయ్ సేతుపతితో చేస్తున్న “బెగ్గర్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ కాగా, తాజాగా నాగార్జున సర్ప్రైజ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని టాక్.
పూరితో గతంలో ‘సూపర్’, ‘శివమణి’ సినిమాలు చేసిన నాగ్, ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టులో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నాగార్జున పాత్ర చిన్నదైనా కథకు బలమైన ట్రాక్ కావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఫ్యాన్స్ లో ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. పూరి మార్క్ మాస్ టచ్కి నాగ్ గ్లామర్ జతకావడం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
ఈసారి పూరి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడని, కంటెంట్ బలంగా ఉంటుందని టాక్. మరి ఈ ప్రయోగం విజయవంతమవుతుందా? అధికారిక సమాచారం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.