
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘భైరవం’ మే 30న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ హిట్ ‘గరుడన్’ రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లైలు కథానాయికలుగా నటిస్తున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్, ముగ్గురు హీరోల పవర్ఫుల్ ప్రెజెన్స్తో సినిమాపై హైప్ పెరిగింది.
ఈ బజ్ను బేస్ చేసుకుని జీ స్టూడియోస్ ‘భైరవం’ నాన్-థియేట్రికల్ రైట్స్ను ఏకంగా రూ.32 కోట్లకు సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్కు హిందీ బేస్ ఉన్నందున ఈ డీల్ కుదరినట్లు ట్రేడ్ టాక్.
ఈ డీల్తో నిర్మాతలు పెట్టుబడి సగానికి పైగా రికవర్ చేయగా, థియేట్రికల్ రైట్స్ కలిపితే భారీ వసూళ్లు ఆశించవచ్చు. దీని వల్ల సినిమా ముందే హిట్ టాక్ తెచ్చుకుంది.
మే 30న పోటీ లేకుండా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్ కొట్టే అవకాశముంది.
BhairavamMovie, Bellamkonda Sreenivas, ZeeStudiosDeal, TollywoodBuzz, Bhairavam Release,