
మహారాష్ట్ర: కరోనా వైరస్ మళ్లీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇద్దరు కోవిడ్ బారినపడి మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ రెండు మరణాలు ముంబైలో నమోదయ్యాయి. మృతుల్లో ఒకరు నెఫ్రోటిక్ సిండ్రోమ్తో, మరొకరు క్యాన్సర్తో బాధపడుతూ కోవిడ్తో మిశ్రమ ప్రభావానికి గురయ్యారు.
ఈ కాలంలో మొత్తం 6,066 స్వాబ్ నమూనాలు పరీక్షించగా, 106 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. అందులో 101 కేసులు ముంబైలోనే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన కేసులు పుణె, థానే, కొల్హాపూర్లో ఉన్నాయి.
ప్రస్తుతం 52 మంది బాధితులు ఇంట్లో స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. 16 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే హాస్పిటల్ను సంప్రదించాలని హితవు తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభించే అవకాశముండటంతో, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.