
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రెండు బలమైన సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో ఒక దాంట్లో టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటించనుండగా, మరొకటి బాలీవుడ్ మాస్టర్ స్టోరీటెల్లర్ అమీర్ ఖాన్తో రూపొందనుంది.
ఎన్టీఆర్ నటించబోయే ప్రాజెక్ట్కు దర్శకధీరుడు రాజమౌళి సమర్పణగా ఉండబోతుండటం విశేషం. ‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్తో నితిన్ కక్కర్ డైరెక్షన్లో ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్లో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, ఎన్టీఆర్ కూడా అంగీకరించారని సమాచారం.
ఇక అమీర్ ఖాన్ సినిమా విషయానికొస్తే, దాన్ని రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేయనున్నారని బాలీవుడ్ బజ్. నాలుగేళ్లుగా ఈ స్క్రిప్ట్పై వర్క్ చేస్తుండగా, అక్టోబర్లో షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో సినిమా తీసిన ధైర్యాన్ని పీరియాడిక్ డ్రామాగా చూపించనున్నారట.
రెండు ప్రాజెక్టులూ టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోలతో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అయితే మార్కెట్ పరంగా రెండు సినిమాల మధ్య పోటీ తప్పకపోవచ్చు. ఇక ఈ బయోపిక్లలో ఏది నిజమైన విజయం సాధిస్తుందో.. వేచి చూడాలి.