fbpx
Sunday, June 8, 2025
HomeTelanganaప్రాజెక్టుల నిర్మాణం ఓ బాధ్యత.. నాణ్యతపై రాజీ లేదు: సీఎం రేవంత్

ప్రాజెక్టుల నిర్మాణం ఓ బాధ్యత.. నాణ్యతపై రాజీ లేదు: సీఎం రేవంత్

revanth-focus-on-irrigation-quality

తెలంగాణ: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నాణ్యతే ప్రథమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన AEలు, JTOలకు నియామక పత్రాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఇంజినీర్లను ఉద్దేశించి, ఒత్తిళ్లకు తలొగ్గకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాజెక్టుల పటిష్టతే లక్ష్యమని రేవంత్ తెలిపారు. 

“నెహ్రూ నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు వందలాది వరదల్ని తట్టుకున్నాయి. కానీ, కాళేశ్వరం మూడు ఏళ్లకే కుంగిపోయింది. ఇది ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణ” అని ఎద్దేవా చేశారు. మట్టి పరీక్షలు లేకుండానే ప్రాజెక్టు నిర్మించారని కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు.

పెండింగ్‌లో ఉన్న దేవాదుల, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాలనలో నీటి ప్రాజెక్టులే ప్రాధాన్యతగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. గ్రూప్-1 నియామకాలపై ఆటంకాలొస్తున్నా త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు రాజీ లేకుండా, బాధ్యతతో పని చేయాలని రేవంత్ రెడ్డి అందరికీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular