
పహల్గామ్: ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంపై ఆరెస్సెస్ సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్థాన్కు గట్టి సమాధానం చెప్పిన భారత సైనిక దళాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.
దేశ భద్రత కోసం అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, పహల్గామ్ దాడి ఒక పిరికిపంద చర్య అని విమర్శించారు.
దీనికి ప్రతిస్పందనగా జరిగిన ఆపరేషన్ భారత్ గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు. ఇది బాధితులకు మాత్రమే కాకుండా దేశ ప్రజలందరికీ ధైర్యం కలిగించిందని అన్నారు.
భారత సైనికులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులు ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దేశ భద్రత కోసం ప్రతీ ఒక్కరు ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.