
ఆంధ్రప్రదేశ్: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఉదార హృదయాన్ని మరోసారి చాటారు. కాకినాడ జిల్లా, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు, పవన్ కల్యాణ్ని కలవాలనే కోరిక వ్యక్తం చేయగా, ఆయన వెంటనే స్పందించారు.
జనసేన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించిన పవన్, ఆమెతో భోజనం చేసి, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కొత్త చీరను బహూకరించడం ద్వారా ఆమె ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
పేరంటాలు 2024 ఎన్నికల్లో పవన్ విజయకాంక్షతో, గ్రామ దేవత వేగులమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. ఎన్నికల విజయానంతరం, ఆమె వెండి గరగ చేయించి సమర్పించడం ద్వారా తన ప్రతిజ్ఞను తీర్చారు.
తన వీరాభిమానిని ఇలా గౌరవించడంలో పవన్ కల్యాణ్ మరోసారి తన వినమ్రత, అభిమానుల పట్ల మమకారాన్ని చాటారు. ఈ ఘటన అభిమానుల్లో పూనకాల్ని రేపుతోంది.