
తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ యూత్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కథలతో యువతను ఆకర్షించే ఆయన, ‘డ్రాగన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించాడు.
ఈసారి కొత్త దర్శకుడు కీర్తిశ్వరణ్ దర్శకత్వంలో ‘డ్యూడ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మేకర్స్ సినిమా టైటిల్ మరియు ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. మమితా సౌత్లో వేగంగా గుర్తింపు పొందుతున్న టాలెంట్ కావడంతో, ఈ జోడీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
‘డ్యూడ్’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మరికొన్ని ప్రధాన భాషల్లో దీన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.
మేకర్స్ ఇప్పటికే దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఫెస్టివల్ సీజన్లో యూత్ ఎంటర్టైన్మెంట్కు ఇది హైలైట్ కానుంది.