Friday, September 4, 2026
HomeAndhra Pradeshషర్మిల ఫైర్.. వైసీపీ అసెంబ్లీ డుమ్మాపై ఆగ్రహం

షర్మిల ఫైర్.. వైసీపీ అసెంబ్లీ డుమ్మాపై ఆగ్రహం

ys-sharmila-slams-ysrcp-absence-budget-session

ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యేలపై కఠిన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైసీపీ నాయకులు అసెంబ్లీకి గైర్హాజరవడం, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆమె అన్నారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, షర్మిల జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

“జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో దూషణలు చేసే ‘షైతాన్ సైన్యాన్ని’ పెంచి పోషిస్తున్నారు,” అని షర్మిల ఆరోపించారు.

జగన్ తన తల్లి విజయమ్మ, తనను తిట్టించేందుకు కూడా సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారని, ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుతనంపై షర్మిల ప్రశ్నిస్తూ, “అసెంబ్లీలో ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా ఉండటం ప్రజలకు వెన్నుపోటు విసరడం కాదా?” అని నిలదీశారు.

బడ్జెట్‌పై వ్యాఖ్యానిస్తూ, ఇది “ప్రజా వంచన బడ్జెట్” అని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలకూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సరిపడా నిధుల కేటాయింపులు చేయలేదని ఆమె ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 15679740926a9b2872d7f24