దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
ఈ అడ్వెంచర్ ఫారెస్ట్ డ్రామాలో మహేష్ బాబు సరసన ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా మరో నటుడు పేరు తెరపైకి వచ్చింది.
విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ను సంప్రదించగా, ఆ పాత్రను తిరస్కరించినట్లు టాక్. విపరీతమైన విలన్ షేడ్ ఉండటం వల్లనే ఆయన వెనకడుగు వేశారని తెలుస్తోంది.
విక్రమ్ రిజెక్ట్ చేసిన పాత్రనే ఇప్పుడు పృథ్వీరాజ్ లేదా ఆర్ మాధవన్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే వారిలో ఎవరు ఖరారయ్యారన్నది వెల్లడి కానుంది.
ఇక మహేష్ లుక్ విషయంలో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. ప్రపంచ యాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది.
ఈ ప్రాజెక్టును కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 లేదా 2027లో సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.