
పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 పై తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు, గ్లోబల్ స్టేజ్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
తాజాగా చిత్ర దర్శకుడు రాజమౌళి వేసవి తీవ్రత దృష్ట్యా సినిమాకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించినట్లు సమాచారం. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్కు విరామం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సమయంలో చిత్ర బృందం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండగా, టెక్నికల్ టీమ్ తదుపరి షెడ్యూల్కు ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ఈ గ్యాప్లో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఓ విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలి కాలంలో మహేష్ కుటుంబంతో కలిసి ప్రయాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాడు. తన కూతురు సితార సెలవుల సమయంలో ఈ ట్రిప్ ఉండే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో ఉండే ఈ ప్రాజెక్ట్లో మహేష్ బాబు విభిన్నమైన లుక్లో కనిపించనున్నాడు.