
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కలిగిన యంగ్ హీరో శ్రీవిష్ణు, త్వరలోనే ‘‘సింగిల్’’ అనే సినిమాతో మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.
తాజాగా ట్రైలర్కు వచ్చిన రెస్పాన్స్తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు, రివ్యూలు, రేటింగ్స్పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘‘సినిమా రివ్యూలను ఆపలేము, మార్చలేము. కానీ ఐదు పాయింట్ల రేటింగ్ బదులు 100 పాయింట్ల రేటింగ్ పెడితే బాగుంటుంది. క్రికెట్ మ్యాచ్లా ఇది కూడా ఒక విశ్లేషణే కదా!’’ అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
కొన్నిసార్లు రివ్యూల్లో చెప్పేది కరెక్ట్ అవుతుందనీ, మరికొన్నిసార్లు తప్పవచ్చుననీ అన్నారు. ‘‘సింగిల్’’ మూవీ టైటిల్ ముందు హ్యాష్ట్యాగ్ పెట్టిన కారణం సినిమా చూస్తేనే తెలుస్తుందనీ, సామజవరగమన టైమ్లోనే ఈ కథ తన వద్దకు వచ్చిందని చెప్పారు.
దర్శకుడు తమిళనాడుకు చెందినవాడని, స్క్రిప్ట్ మీద కష్టపడి పని చేశామని వెల్లడించారు. కాగా, సినిమాలోని ఒక సీన్పై వచ్చిన వివాదం గురించి మాట్లాడుతూ, ‘‘సోషల్ మీడియాలో వైరల్ అయిన మూమెంట్స్ రీక్రియేట్ చేయాలనే ఉద్దేశమే. కించపరిచే ఆలోచనేమీ లేదు’’ అని స్పష్టంగా తెలిపారు శ్రీవిష్ణు.
sreevishnu, single movie, review system, tollywood updates, sreevishnu comments,