Monday, November 10, 2025
HomeAndhra Pradeshకేంద్రానికి దాసోహం అంటున్న చంద్రబాబు, జగన్, షర్మిల ఫైర్

కేంద్రానికి దాసోహం అంటున్న చంద్రబాబు, జగన్, షర్మిల ఫైర్

sharmila-slams-babu-jagan-over-modi-stance

ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ప్రధానమంత్రి మోదీకి దాసోహం అయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ప్రశ్నించే ధైర్యం కేవలం కాంగ్రెస్‌కే ఉన్నదని ఆమె అన్నారు.

జూన్ నెలలో 26 జిల్లాల్లో 2,500 కిలోమీటర్ల పర్యటన చేసిన షర్మిల, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయడంలో ఏ నాయకుడూ విఫలమయ్యారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి రావడంలో చంద్రబాబు పాత్ర ఉన్నా, ఆయన ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని తెలిపారు.

జగన్ అయితే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి చివరికి తన మెడే వంచారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్, పోలవరం ఎత్తు, రాజధాని నిధులు ఇలా ఎన్నో సమస్యలపై రాష్ట్రం మౌనంగా ఉన్నదని మండిపడ్డారు.

విభజన హామీలను పట్టించుకోకుండా మోదీకి మద్దతు ఇచ్చిన పవన్, చంద్రబాబు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా, జగన్ మాత్రం మోదీకి గులాంగిరీ చేశారని ఆరోపించారు.

రాబోయే నాలుగేళ్లలో కాంగ్రెస్ పునరుత్థానం తప్పదని, ప్రజలు తిరిగి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. నిజమైన నాయకులకు గుర్తింపు కాంగ్రెస్‌లోనే ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular