
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిన విషయమే. ఆయన తాజా చిత్రం ది రాజాసాబ్పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దర్శకుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ హారర్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ప్రభాస్కు ఇది ఒక డిఫరెంట్ అవతారం అనే చెప్పాలి.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని టాక్. ఇప్పటికే ప్రభాస్ తన డబ్బింగ్ పార్ట్ పూర్తిచేశారని తెలుస్తోంది.
ఈ టీజర్ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇక విలన్గా సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.