
తమిళంలో స్టార్ డైరెక్టర్గా సత్తా చాటుతున్న లోకేష్ కనగరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రజనీకాంత్, కమల్హాసన్లతో మల్టీస్టారర్ సినిమా చేయాలనే తన కోరికను తాజాగా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశారు.
ఇద్దరూ వయసు మళ్లిన గ్యాంగ్స్టర్స్గా కనిపించేలా కథ సిద్ధమైందని లోకేష్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మార్కెట్ విలువలు, బిజీ షెడ్యూల్స్ దృష్ట్యా ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమైందన్నారు. అయినా, ఇది తన మనసులో ఇప్పటికీ మెదులుతున్న డ్రీమ్గా ఉందని చెప్పారు.
ప్రస్తుతం లోకేష్, రజనీకాంత్తో ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. అలాగే ‘కైతి 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ లాంటి సినిమాలు LCUలో ప్లాన్లో ఉన్నాయి. కమల్, సూర్య, కార్తీ, విజయ్లతో గతంలో చేసిన అనుభవం ఈ మల్టీస్టారర్కి కలిసొస్తుందని ట్రేడ్ అంటోంది.
ఇప్పటి వరకు రజనీ కమల్ కాంబినేషన్లో అభిమానులు పూర్తిస్థాయి సినిమా చూడలేదు. చివరిసారిగా 1985లో ‘గిరఫ్తార్’ అనే హిందీ చిత్రంలో వీరు కలిసి కనిపించారు.
ఈ కల సాకారం అయితే దక్షిణాదికి గోల్డెన్ మల్టీస్టారర్గా నిలవడం ఖాయం. లోకేష్ ఈ కాంబినేషన్ని తెరపైకి తేవాలని ఎంత కష్టపడుతున్నాడో చూస్తుంటే ఇది ఓ రికార్డు ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Lokesh Kanagaraj, Rajinikanth, Kamal Haasan, Multistarrer Movie, Dream Project,