
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని పెద్ద కుట్ర జరుగుతోందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆశపడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, కేటీఆర్ను పక్కకు నెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్లాన్కు బీజేపీ నేతల మద్దతు ఉందని చెప్పారు.
హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో ఓ టాలీవుడ్ హీరోయిన్ స్టేట్మెంట్లో కేటీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని, దాన్నే ఆధారంగా చేసుకుని ఇప్పుడు కుట్ర పన్నుతున్నారని రామ్మోహన్ తెలిపారు.
బెంగళూరులోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలోనే ఈ కుట్ర ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
తాను గతంలో చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని గుర్తుచేస్తూ, ఈసారి కూడా పెద్ద విషయాలు వెలుగులోకి వస్తాయని జోస్యం చెప్పారు. కేటీఆర్పై దాడులు రాజకీయ లాభాల కోసమేనని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఈ కుట్రపై మరిన్ని సాక్ష్యాలు బయటపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
