
మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, టెలివిజన్, డిజిటల్ మాధ్యమాల్లో కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందింది.
ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూడాలన్న క్రేజ్ను చూసి మేకర్స్ రీ-రిలీజ్ ప్లాన్ను అమలు చేయనున్నారు.
ఇక ‘ఖలేజా’ రీ-రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ, ఈ సినిమాకు బుక్ మై షోలో అభిమానుల స్పందన అదిరిపోయేలా ఉంది. ఒక్క గంటలోనే 14 వేల టికెట్లు బుక్ అవ్వడం ఈ సినిమాపై ఎంత క్రేజ్ నెలకొందో స్పష్టం చేస్తోంది.
త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, మహేష్ బాబు ఎనర్జీ, మణిశర్మ సంగీతం కలగలిపి ‘ఖలేజా’ సినిమాను ఓ వినోదాత్మక యాత్రగా మార్చాయి. ఇప్పుడు కొత్త థియేట్రికల్ మిక్స్, రెమాస్టర్డ్ వెర్షన్ వల్ల ఈ అనుభూతి మరింత రిచ్గా ఉండబోతోంది.
ఈ సినిమా రీ-రిలీజ్ కు ముందు నుంచే ఇంతటి హైప్ ఏర్పడటంతో మేకర్స్ ధైర్యంగా భారీ స్క్రీన్ కౌంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ అయితే “ఈసారి ఖలేజా బ్లాక్బస్టర్గా నిలుస్తుంది” అంటూ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు.