
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్రూమ్ డ్రామా కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్ ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 18న హిందీలో విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, మే 23న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానుంది.
సి. శంకరన్ నాయర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బ్రిటిష్ దమన రాజకీయాలను తెరపై తెచ్చింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో, ఆర్. మాధవన్, అనన్యా పాండే కీలకంగా నటించారు. రఘు పాలత్, పుష్ప పాలత్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సినిమా, దేశభక్తిని చాటే న్యాయ పోరాటాన్ని చూపిస్తుంది.
తెలుగు వెర్షన్ విడుదల హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు బిజినెస్ బజ్ను పెంచింది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా టేబుల్ ప్రాఫిట్ సాధించడంతో, థియేట్రికల్ సక్సెస్కూ ఆశలు ఉన్నాయి.
తెలుగు ప్రేక్షకుల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఆదరణ ఉండటంతో, కేసరి 2 కూడా మంచి రెస్పాన్స్ పొందే అవకాశముంది.
Akshay Kumar, Kesari2 Telugu, Jallianwala Bagh, Telugu Release, Suresh Productions,