
ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్లాప్, హిట్లు పక్కన పెట్టి, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమాలను మరోసారి వెండితెరపై చూడడానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ అయ్యింది.
కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ అప్పట్లో చిరంజీవి కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సంచలనమైన విజయాన్ని అందుకుంది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలోకి వచ్చింది.
మార్చిన తరాలు కూడా ఈ కల్ట్ మూవీని చూసేందుకు థియేటర్లకు తరలివస్తుండటం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1.75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు.
చిత్ర యూనిట్ ధీమాగా, రాబోయే రోజుల్లో రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని భావిస్తోంది. చిరు-శ్రీదేవి మ్యాజిక్ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందేమో చూడాలి!