
న్యూస్ డెస్క్: ఇప్పుడిప్పుడే ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. గతంలో ఐటీఆర్ రిఫండ్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థల అభివృద్ధితో రిటర్న్ దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే చాలామందికి రిఫండ్ అందుతోందని వినిపిస్తోంది.
నోయిడా నివాసి అరుణ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఉదాహరణగా, తన ఐటీఆర్ ఫైల్ చేసిన నాలుగు గంటల్లోనే రిఫండ్ ఖాతాలోకి వచ్చిందని చెప్పారు. ఇదే అనుభవాన్ని పన్ను నిపుణులు కూడా పంచుకుంటున్నారు. పాత రోజులలో 90 రోజుల వరకు పట్టిన ఐటీ రిఫండ్లు ఇప్పుడు గంటల్లోనే విడుదల కావడం ఒక గొప్ప మార్పు.
ఈ వేగానికి కారణంగా ఆదాయపన్ను శాఖ పూర్తిగా ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ను ప్రారంభించింది. పాత ఎక్సెల్ పద్ధతులు పోయి, డేటా రీడింగ్ వేగంగా చేసే JSON ఫార్మాట్ ప్రవేశ పెట్టారు. బ్యాంకు ఖాతా ప్రీ-వెరిఫికేషన్, పాన్-ఆధార్ అనుసంధానం వంటి కారణాలు కూడా ప్రధాన కారణాలు.
అయితే ఇంకా చాలా మందికి ఈ ప్రాసెస్ అంత వేగంగా జరిగిందా లేదా అన్నది క్లియర్ కాదు. అయినా ఈ మార్పుతో పన్ను చెల్లింపుదారులు ఆనందంగా ఉన్నారు.
