fbpx
Tuesday, June 17, 2025
HomeUncategorizedబీసీలకు 42% రిజర్వేషన్ కోసం కవిత ధీక్ష.. రైల్ రోకో ప్రకటన

బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కవిత ధీక్ష.. రైల్ రోకో ప్రకటన

bc-reservation-kavitha-rail-roko-july17

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటానికి తుది సమయానికి చేరుకుంటున్నారు. బీసీలు ఒకతాటిపైకి వచ్చి పోరాడితే, వారిని ఆపగలిగేది ఎవరూ లేదని ఆమె హెచ్చరించారు.

మెదక్‌లో జరిగిన “కామారెడ్డి డిక్లరేషన్ – రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ల సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత, ఇది రాజకీయంగా కాక మానవ హక్కుల ఉద్యమంగా చూస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వేరుగా రిజర్వేషన్లు రావాలని కోరారు. బీసీ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రమంతా బీసీ సామాజిక న్యాయం కోసం కలిసికట్టుగా పోరాడాలనీ, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనీ సూచించారు. జూలై 17న రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, రిజర్వేషన్‌లు లేకుండా ఎన్నికలు జరిగితే ఆవిధంగా ఆపుతామని తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular