న్యూస్ డెస్క్: ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా సంభవిస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఏఐ-159 ఫ్లైట్ను తాత్కాలికంగా రద్దు చేశారు. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అధికారులు ఇది తీసుకున్న నిర్ణయం.
ఈ విమానం ఈ మధ్యాహ్నం 1.10కి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరాల్సి ఉండగా, టేకాఫ్కు ముందు నిర్వహించిన తనిఖీల్లో లోపం వెలుగుచూసింది. వెంటనే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సేవను రద్దు చేశారు.
గత వారం ఇదే మార్గంలో ఎయిరిండియా ఏఐ-171 ఫ్లైట్ కుప్పకూలిన ఘటన మరువకముందే మరోసారి సమస్య తలెత్తడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో దాదాపు అందరూ మృతి చెందారు. దీంతో ఎయిరిండియా ఆ ఫ్లైట్ నంబర్ను నిలిపివేసి, కొత్తగా ఏఐ-159గా మార్చారు.
ఇప్పటికే ఈ ప్రమాదం తర్వాత మొదటి సర్వీసు ఇదే కావడం, అదే తరహా విమానంలో మరోసారి లోపం రావడం ప్రయాణికుల్లో భయాన్ని పెంచింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఎయిరిండియా అధికారికంగా దీనిపై స్పందించినా, ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందడం ఇప్పుడు సంస్థకు పెద్ద సవాల్గా మారింది.