
గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా గురువారం చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. 265 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోర ఘటనలో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతంగా మారింది. ప్రమాద సమయంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు.
ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం లండన్కు బయలుదేరిన కొద్ది నిమిషాలకే గాల్లోనే పేలి ముక్కలైపోయింది. విశ్వాశ్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ ద్వారం పక్కనే 11ఏ సీటులో కూర్చొని ఉండగా, విమానం ముక్కలయ్యే సమయంలో ఆ సీటు విడిపోయి గాల్లోకి ఎగిరిపోయింది. సీటు బెల్టుతో ఉండటం వల్లే తాను బయటపడ్డానని ఆయన తెలిపారు.
విమాన మంటల మధ్య అహ్మదాబాద్ వైద్య కళాశాల హాస్టల్ పై కూలింది. దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. పైలట్ ‘మేడే’ సంకేతం పంపినా.. పెద్ద ప్రమాదం తప్పలేదు. కేవలం 800 అడుగుల ఎత్తులోనే విమానం కూలిపోయింది. మృతుల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు.
బ్లాక్ బాక్స్ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ టెక్నికల్ లోపమేనా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
విజయ్ రూపానీ సహా పలువురు ప్రఖ్యాతులు కూడా మృతిచెందినట్టు సమాచారం. దుర్ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.