
న్యూస్ డెస్క్: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉధృతంగా మారుతున్న వేళ, టెహ్రాన్లో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగంగా ప్రారంభించింది. ఇప్పటికే మొదటి విడతలో 110 మంది భారతీయులు అర్మేనియాకు తరలించబడ్డారు.
వారు రేపు (జూన్ 18) ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరనున్నారు. ఇజ్రాయెల్ నిర్వహించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు నిత్యం తీవ్రంగా మారుతున్నాయి. ఈ దాడుల పరంపర ఇప్పటికే ఐదో రోజుకు చేరుకుంది.
ఇరాన్ ప్రతిగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, వందలమంది గాయపడ్డారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో మరో విపత్కర యుద్ధ వాతావరణాన్ని సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య టెహ్రాన్లో నివసిస్తున్న భారతీయులు తక్షణమే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కేంద్రం హెచ్చరించింది. హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసింది. +989010144557; +989128109115; +989128109109
ఇదే తరహాలో టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ అందుబాటులో ఉంచింది. +972 54-7520711, +972 54-3278392,