
ఢిల్లీ: దేశ భద్రత కోసం ఇస్రో రూపొందించిన పది అత్యంత ప్రాధాన్యమైన నిఘా ఉపగ్రహాలు ఇప్పటికీ నిరంతరం నిఘా నిర్వహిస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
అగర్తలలో జరిగిన సీఏయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, వీటి విశేషాలను వివరించారు. దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను ఈ ఉపగ్రహాలు భద్రతను నిర్ధారించడానికి తీరప్రాంతాలు, సరిహద్దులు మరియు అంతర్గత ప్రాంతాలను పగలు రాత్రి పర్యవేక్షిస్తాయి.
“సముద్రతీరాలు, సరిహద్దుల పర్యవేక్షణలో ఈ ఉపగ్రహాలు కీలకంగా మారాయి. అత్యాధునిక ఉపగ్రహ, డ్రోన్ సాంకేతికత లేకపోతే వ్యూహాత్మక లక్ష్యాలు సాధ్యం కాదు,” అని నారాయణన్ అన్నారు.
భద్రతకే కాక, వ్యవసాయం, వైద్యం, వాతావరణం, విద్య రంగాల్లోనూ ఇవి సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో ఉపగ్రహాల పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు.
ఇస్రో ఇప్పటివరకు 433 అంతర్జాతీయ ఉపగ్రహాలను ప్రయోగించి, ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటిందని తెలిపారు. అమెరికాతో కలిసి నిర్మిస్తున్న అత్యాధునిక ఉపగ్రహం భద్రతకు ఊతమిస్తుందని వివరించారు.
ఈ ఉపగ్రహ వ్యవస్థ భారత భద్రతా వ్యవస్థలో నక్షత్ర కవచంలా మారిందని నారాయణన్ స్పష్టం చేశారు.