
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై వచ్చిన తొలి సినిమా ‘కుమారి 21F’ మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. 2015లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది.
దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సుకుమార్ కథ, స్క్రీన్ప్లే ఆధారంగా నిర్మించడం విశేషం.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో కనిపించగా, రాజ్ తరుణ్తో కలిసి క్యూట్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ఓ స్పెషల్ అడ్వాంటేజ్గా మారింది. పాటలు అప్పట్లో యువత మదిలో నిలిచిపోయాయి.
ఇప్పుడు ఈ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకుంటుండటంతో చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా సినిమాను రీ-రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రీ-రిలీజ్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది.
ఫ్యాన్స్ ఇప్పుడు “కుమారి 21F” మళ్లీ ఏ తేదీన థియేటర్లలోకి వస్తుందో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో మిస్ అయిన ప్రేక్షకులు ఈసారి థియేటర్లో ఎంజాయ్ చేసే అవకాశం దక్కించుకుంటారు.