
2025 సమ్మర్ టాలీవుడ్కు ఊహించని షాక్లను అందిస్తోంది. పలుచోట్ల షూటింగ్లలో జాప్యం, పోస్ట్-ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ‘హరిహర వీరమల్లు’, ‘విశ్వంభర’, ‘తమ్ముడు’, ‘కింగ్డమ్’ వంటి సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ వాయిదాలు ప్రేక్షకుల్లో నిరాశను కలిగిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా మే 30కి అనుకున్న విడుదలను వాయిదా వేసి, తాజాగా జూలై 4కు షిఫ్ట్ చేసినట్టు సమాచారం. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్పై మంచి అంచనాలున్నాయి.
ఇప్పటివరకు విడుదలైన టీజర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం, సినిమాపై క్రేజ్ పెంచింది. అయితే అదే తేదీన నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా విడుదల కావాల్సి ఉండగా, పోటీని నివారించేందుకు దిల్ రాజు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
తమ్ముడు సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండు సినిమాలూ విజయ్, నితిన్ కెరీర్కు టర్నింగ్ కావాల్సిన వేళ, క్లాష్ నివారించడం బెటర్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.