
అక్కినేని అఖిల్ – జైనబ్ రవ్జీ వివాహం జూన్ 6న అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. ఇది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగే ప్రైవేట్ వేడుకగా రూపొందించబడుతోంది. జైనబ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్వుమన్గా ‘ఒన్స్ అపాన్ ది స్కిన్’ బ్రాండ్ ద్వారా గుర్తింపు పొందింది.
వివాహానికి ముందు నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఈ శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లతో అక్కినేని కుటుంబం ఇప్పటికే బిజీగా ఉంది.
తాజా సమాచారం ప్రకారం, జూన్ 8న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. దీనిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు హాజరయ్యే అవకాశం ఉంది.
రెసెప్షన్ వేదికగా అన్నపూర్ణ స్టూడియోస్ను భారీగా అలంకరించనున్నారని తెలుస్తోంది. లైవ్ మ్యూజిక్, డాన్స్ పెర్ఫార్మెన్సులతో పాటు, ప్రత్యేక ఆహార విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.