
అమెరికాలోని ప్రవాస భారతీయులకు షాక్ ఇచ్చేలా రిపబ్లికన్ సభ్యులు కొత్త పన్ను చట్టాన్ని ప్రతిపాదించారు. ‘‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా ప్రకారం, అమెరికా పౌరులు కాకుండా విదేశాలకు డబ్బు పంపే వారిపై 5% పన్ను విధించనున్నారు.
ఈ ప్రతిపాదన చట్టంగా మారితే, హెచ్-1బీ, ఎఫ్-1, జె-1 వీసా దారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, పత్రాల్లేని వలసదారులు ప్రభావితమవుతారు. ఉదాహరణకు, భారత్కు ₹1 లక్ష పంపితే, అదనంగా ₹5,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పన్ను రెమిటెన్స్ సర్వీసుల ద్వారా వసూలై, అమెరికా ప్రభుత్వానికి త్రైమాసికంగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా పౌరులు మాత్రం అర్హత కలిగిన సేవలద్వారా పంపితే మినహాయింపు పొందవచ్చు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని అందుకుంటుంది. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే, రెమిటెన్స్లో తేడా వస్తుందని, రూపాయి విలువపై ప్రభావం చూపవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికీ ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. కాన్సెస్, సెనేట్ ఆమోదిస్తే జూలై 4 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.