
హీరో నితిన్ తాజా చిత్రం ‘తమ్ముడు’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రం జూలై 4న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్తో పాటు ఎమోషనల్ కథాంశంతో కూడిన చిత్రంగా రూపొందింది.
ఈ సినిమాపై మేకర్స్కు మంచి నమ్మకం ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ విశేషం బయటకు వచ్చింది. ‘తమ్ముడు’ చిత్రానికి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్మాత దిల్ రాజు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రకటించారు.
ఈ షోలు జూలై 3వ తేదీ రాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ కారణంగానే ముందుగానే ప్రీమియర్లు పెడుతున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో నితిన్కు తోడు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథానాయికలందరికీ గట్టిగాప్లేస్ ఉన్న సినిమా ఇది.
ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన అందుకుంటున్నాయి. ‘తమ్ముడు’ సినిమా నితిన్కు హిట్ అందిస్తుందా లేదా అన్నది జూలై 4న తెలుస్తుంది.
