Sunday, January 18, 2026
HomeNationalపోలవరం నిధుల గోల‌.. 1850 కోట్ల లెక్కలతో కేంద్రం కఠినంగా!

పోలవరం నిధుల గోల‌.. 1850 కోట్ల లెక్కలతో కేంద్రం కఠినంగా!

polavaram-funds-controversy-centre-notice-to-andhra

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వానికి మరోసారి పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం తలనొప్పిగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర “జీవనాడి”గా అభివర్ణిస్తూ, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల పచ్చదనానికి ఇది కీలకం అని చెబుతున్నారు. కానీ కేంద్రం తాజాగా పంపిన లేఖతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

2024- 25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి 2000 కోట్లు కేటాయించగా, అందులో 1850 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది.

ఈ నిధులను నిర్దేశిత ప్రాజెక్టు ఖాతాలో వినియోగించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సమర్పించకపోవడంతో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

జలశక్తి మంత్రిత్వశాఖ రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసి, “1850 కోట్ల ఖర్చు వివరాలు తక్షణమే ఇవ్వాలి, ఇది తప్పనిసరి (This is mandatory)” అని స్పష్టం చేసింది.

ఇక 2025-26 బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా 5000 కోట్ల కేటాయింపు చేసినా, పాత లెక్కలు రాకపోవడంతో ఆ నిధులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ మొత్తంలో పునరావాసం, నష్టపరిహారం చెల్లింపులు, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కానీ లెక్కల లోపం కారణంగా ప్రాజెక్టు పురోగతి మరోసారి నిలిచిపోయే అవకాశం ఉంది.

దీనిపై సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో ఆర్థిక శాఖా మంత్రిని కలిసి నిధుల విడుదల కోరినప్పటికీ, జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలో ఉందని సమాధానం లభించింది. ఫలితంగా ప్రాజెక్టు భవిష్యత్తు మరోసారి అనిశ్చితిలో పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular