
న్యూస్ డెస్క్: భారత గూఢచార సంస్థ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) నూతన చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత అధిపతి రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో జూలై 1 నుంచి పరాగ్ జైన్ ఈ బాధ్యతలు చేపడతారు.
1989 బ్యాచ్కు చెందిన పంజాబ్ కేడర్కు చెందిన పరాగ్ జైన్ గతంలో పంజాబ్ డీజీపీగా సేవలందించారు. 2021 జనవరిలో ఆయన డీజీపీ హోదాలో నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయానికి జూన్ 2న ఆమోదముద్ర వేసింది.
గూఢచార రంగంలో ఆయనకు ‘సూపర్ స్లూత్’గా పేరుంది. మానవ మేధస్సు (హ్యూమింట్) మరియు సాంకేతిక సమాచారం (టెకింట్)ను సమర్ధవంతంగా సమన్వయం చేసి సంక్లిష్ట ఆపరేషన్లను విజయవంతం చేయడంలో నిపుణత కనబరిచారు.
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఆయన కీలక పాత్ర పోషించారు. పీఓకేలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడుల్లో కీలక ఇంటెలిజెన్స్ను అందించారు.
జమ్మూ కాశ్మీర్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. అంతేకాక కెనడా, శ్రీలంకల్లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పని చేశారు.
