
బీహార్: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ‘అపర చాణక్యుడు’ అనిపించుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది.
ఈ విజయంతో నితీష్ కుమార్ ఐదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన సీఎం పదవికి పదోసారి ప్రమాణ స్వీకారం కానుండటం విశేషం.
ఎన్నికల ముందు నితీష్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆయన మానసికంగా, శారీరకంగా అలసిపోయారని, రెండు దశాబ్దాల పాలనతో యాంటీ-ఇంకంబెన్సీ ఉందని ప్రచారం చేశాయి.
అయితే, “టైగర్ అభీ జిందా హై” (పులి ఇంకా బతికే ఉంది) అనే ఒకే ఒక్క నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ ఎన్నికల్లో జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేసి 80కి పైగా సీట్లను గెలుచుకోవడం ఆయన చరిష్మాకు నిదర్శనం.
ఈ విజయంతో నితీష్ కుమార్, నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రికార్డును కూడా అధిగమించారని రాజకీయ విశ్లేషకులు పోలుస్తున్నారు.
ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ, నితీష్ తన రాజకీయ అనుభవాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. నవంబర్ 15 లేదా 18 తేదీలలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
