
ఒక్క ‘లిటిల్ హార్ట్స్’ మూవీతో యంగ్ హీరో మౌళి తనుజ్ పేరు ఇండస్ట్రీ అంతా మార్మోగిపోయింది. ఊహించని విజయం తర్వాత అతనిపై అగ్ర నిర్మాణ సంస్థల దృష్టి పడింది. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ మౌళికి ఏకంగా కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ ఫ్యాన్స్లో పెద్ద చర్చకు దారితీశాయి.
అయితే తాజాగా నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. “మేము ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూశాం, చాలా బాగా తీశారు. కానీ మౌళికి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చామనే విషయం పూర్తిగా అవాస్తవం” అని వారు తెలిపారు. దీని వల్ల ఈ రూమర్స్కి అధికారికంగా ఎండ్ కార్డు పడింది.
అయినా మౌళిపై మైత్రీ సంస్థకు ఆసక్తి మాత్రం ఉందని చెప్పారు. “మేము హీరో మౌళితో పాటు దర్శకుడికీ అడ్వాన్స్ ఇచ్చాం, కానీ ఆ మొత్తం అంత పెద్దది కాదు. సరైన కథ కుదిరితే భవిష్యత్తులో వారితో తప్పకుండా సినిమా చేస్తాం” అన్నారు.
ఇలా మౌళి చుట్టూ క్రియేట్ అయిన హైప్ తాత్కాలికమని తేలినా, ఆయన ప్రతిభపై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ల ఆసక్తి మాత్రం కొనసాగుతోంది. ‘లిటిల్ హార్ట్స్’ విజయంతో ఆయన కెరీర్కి కొత్త దశ మొదలైనట్టే.
