
న్యూస్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ అంశం కీలకంగా మారింది. జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగి, పర్యాటకులు బలైపోయిన తర్వాత కేంద్రం పాకిస్థాన్ పై కౌంటర్ దాడులు ప్రారంభించింది. ఈ దాడులను ఆపిన వెంటనే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా భారత్, పాకిస్థాన్ ఇద్దరూ తన హెచ్చరికల వల్ల ఆపరేషన్ సిందూర్ ఆపేశారని అన్నారు. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించాయి. అమెరికా అధ్యక్షుడి ప్రమేయం ఎంతవరకు ఉన్నదని ప్రశ్నించాయి.
విపక్షాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్ చేసి, ఎందుకు ఆపరేషన్ సిందూర్ను అర్ధాంతరంగా ముగించారో కేంద్రాన్ని నిలదీశాయి. భారత్కు విదేశీ జోక్యం అవసరమా? అని నిలదీశారు. పహల్గాం దాడిపై నిఘా సంస్థల వైఫల్యం గురించి కూడా ప్రశ్నలు సంధించారు.
తాజాగా ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎవరూ జోక్యం చేయలేదన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినంగా స్పందించిందని వివరించారు. ప్రపంచ దేశాల మద్దతుతోనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇలాంటి దాడులకు పాల్పడే దేశాలపై చర్యలు కొనసాగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సున్నితంగా వ్యవహరించే ప్రసక్తే లేదన్నారు.
