
న్యూస్ డెస్క్: అమెరికాలో వలస విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ తాజాగా హెచ్-1బీ వీసా సాలరీ డేటాను బయట పెట్టింది. ఈ రిపోర్ట్ టెక్ ప్రపంచంలో ఉద్యోగుల వేతనాలపై చర్చకు దారితీసింది.
ట్రంప్ పాలనలో వీసా ఖర్చులు పెరగడం వల్ల వివాదం తలెత్తింది. విదేశీ ఉద్యోగులు స్థానికులకు అవకాశాలు తగ్గిస్తున్నారని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సాలరీల డేటా మరింత ఆసక్తి రేపింది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు 2.5 కోట్లు దాటే వేతనాలు ఆఫర్ అవుతున్నాయి. డేటా సైన్స్, AI రంగాల్లో కూడా ఇలాంటి జీతాలు ఉండటం గమనార్హం. ముఖ్యంగా మౌంటెన్ వ్యూ, రెడ్మండ్ ఆఫీసుల్లో ప్రిన్సిపల్ స్థాయి ఉద్యోగులకు భారీ వేతనాలు అందిస్తున్నారు.
అయితే మైక్రోసాఫ్ట్ ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తూ, మరోవైపు ప్రతిభావంతులను అత్యధిక జీతాలతో ఆకర్షిస్తోంది. ఇది కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పబడుతోంది.
అమెరికాలో స్థానికులపై ప్రభావం ఉంటుందని వాదనలు ఉన్నా, గ్లోబల్ టెక్ దిగ్గజాలు మాత్రం ప్రతిభ కోసం సరిహద్దులు లేవని నిరూపిస్తున్నాయి. టాప్ స్కిల్ ఉన్నవారికి ఏ స్థాయిలోనైనా వేతనాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ డేటా ద్వారా టెక్ రంగంలో ఉన్న పోటీ స్పష్టమైంది. వేతనాలే కాకుండా, భవిష్యత్ మార్కెట్ ఎటు దిశగా వెళ్తోందో కూడా ఈ రిపోర్ట్ అద్దం పట్టిందని నిపుణులు అంటున్నారు.
