
టాలీవుడ్లో స్టార్ హీరోలు, క్రియేటివ్ డైరెక్టర్ల కాంబినేషన్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మహేష్ బాబు – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా రూమర్స్ ఉన్నా.. ఇప్పుడు ప్లాన్ క్లియర్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత నుంచే ఈ కాంబోపై చర్చ మొదలైంది. ఆ సమయంలో మహేష్ రిస్క్ చేయలేదు. కానీ అప్పట్లో ‘యానిమల్’ ప్రమోషన్స్లో వంగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హైప్ క్రియేట్ చేశాయి. ఆయన మాటల్లో “మహేష్ కోసం మరింత వైలెంట్ కథ రెడీగా ఉంది” అన్న లైన్ ఫ్యాన్స్లో క్రేజ్ పెంచింది.
ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడంలో AMB సినిమాస్ భాగస్వామి ఏషియన్ సునీల్ కీలకంగా ఉన్నారని సమాచారం. సునీల్ వంగా కాంబో ఇప్పటికే ఫిక్స్ కావడంతో, ఆ డీల్ను మహేష్ ప్రాజెక్ట్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం రేసులోకి వచ్చారని టాక్.
మహేష్ ప్రస్తుతం SSMB29 (రాజమౌళి ప్రాజెక్ట్) మీద ఫోకస్ చేస్తున్నారు. అది 2027 వరకు లాకవ్వడం ఖాయం. కాబట్టి వంగా కాంబో త్వరలో అనౌన్స్ అవ్వకపోయినా.. సైలెంట్గా ప్లాన్ అవుతున్నదనే టాక్ బలంగా వినిపిస్తోంది.
