
న్యూస్ డెస్క్: 2025 ఆసియా కప్లో టీమిండియా అద్భుత ఆరంభంతో మొదలైంది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ కేవలం 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 58 పరుగుల చిన్న లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే చేధించి అభిమానులను ఉర్రూతలూగించింది.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ప్రత్యేక రికార్డు సాధించాడు. ఛేదనలో తొలి బంతినే సిక్స్ బాది భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒవరాల్గా టీ20ల్లో ఈ రికార్డు సాధించిన నాలుగో భారత ఆటగాడు అయ్యాడు.
ఇంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ మాత్రమే ఈ ఫీట్ను నమోదు చేశారు. ఇప్పుడు అభిషేక్ కూడా వారితో సమానమయ్యాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
భారత్ బౌలర్లు యూఏఈని 57 పరుగులకే కట్టడి చేశారు. దీని వలన ఆసియా కప్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ప్రత్యర్థులను 60 పరుగులలోపే ఆలౌట్ చేసిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్ ఫైనల్లో శ్రీలంకను 50 పరుగులకే ఆపడం గుర్తుంచుకోవాలి.
టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు కలిసి మరోసారి తమ ఆధిపత్యాన్ని చూపించారు. ఈ విజయంతో భారత్ టోర్నీలో బలమైన సంకేతం ఇచ్చింది.
