
న్యూస్ డెస్క్: గువాహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 9/0 స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 201 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ 6 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాడు.
ఒక దశలో భారత్ 95/1తో పటిష్ఠంగా ఉన్నా, ఆ తర్వాత ఆట పూర్తిగా మారిపోయింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ సహా టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (58) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (48), కుల్దీప్ యాదవ్ (19) ఎనిమిదో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ను 200 దాటించారు.
ఫాలో ఆన్ ఇచ్చే అవకాశం ఉన్నా సౌతాఫ్రికా ఆ నిర్ణయాన్ని వదులుకుంది. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసిన సౌతాఫ్రికా, భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసింది.
ప్రస్తుతం సౌతాఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్నందున, భారత్ తీవ్రంగా పోరాడితే తప్ప మ్యాచ్ను డ్రా చేసుకోవడం కూడా కష్టమే.
