
న్యూస్ డెస్క్: ఆసియా కప్లో భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాదుల అభ్యర్థనపై ధర్మాసనం కఠినంగా స్పందించింది.
న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లు “ఇది కేవలం ఒక మ్యాచ్. అంత అత్యవసరం ఏమిటి? జరగనివ్వండి” అంటూ స్పష్టం చేశారు. మ్యాచ్ ఆదివారం జరగనుండటంతో దీన్ని అడ్డుకోవాలన్న ప్రయత్నంపై అసహనం వ్యక్తం చేశారు.
పిటిషనర్లు మాత్రం పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్తో మ్యాచ్ జరపడం సరికాదని వాదించారు. ఇది జాతీయ గౌరవానికి విరుద్ధం అవుతుందని, సైనికుల త్యాగాలను అవమానించేలా ఉంటుందని కోర్టుకు తెలిపారు.
అలాగే, ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఈ మ్యాచ్ మరింత బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. క్రీడా పోటీ కంటే దేశ గౌరవం, భద్రత ముఖ్యమని జోరుగా వాదించారు.
అయితే, సుప్రీంకోర్టు దీనిని వినోదాత్మక క్రీడా ఈవెంట్గా మాత్రమే పరిగణిస్తూ, జోక్యం అవసరం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న దుబాయ్లో భారత్-పాక్ మ్యాచ్ జరగడం ఖాయమైంది.
మొత్తానికి, పిటిషన్ పై చర్చలు ఎంత కలకలం రేపినా.. అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇవ్వడంతో మ్యాచ్ నిర్విఘ్నంగా జరగబోతుంది.
