Sunday, July 12, 2026
HomeNationalఅప్పట్లో అందుకే యుద్ధానికి వెనక్కి తగ్గాం.. చిదంబరం కామెంట్స్

అప్పట్లో అందుకే యుద్ధానికి వెనక్కి తగ్గాం.. చిదంబరం కామెంట్స్

Chidambaram-on-2611-War-Decision

న్యూస్ డెస్క్: 2008లో జరిగిన 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులు భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనలుగా నిలిచాయి. ఆ దాడులు కేవలం దేశానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కలకలం రేపాయి. ప్రాణనష్టం, ఆర్థిక నష్టం దేశాన్ని కుదిపేశాయి.

ఈ ఘటనపై అప్పటి హోంమంత్రి పి. చిదంబరం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడుల తరువాత భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైందని, కానీ ఆ దశలో అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వెనక్కు తగ్గినట్లు వెల్లడించారు.

ప్రత్యేకంగా అమెరికా అప్పటి విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైజ్ భారత్‌ను అడ్డుకున్నారని, యుద్ధం కాకుండా శాంతియుత పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చిందని ఆయన అన్నారు.

ఈ కామెంట్లు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో వేడి చర్చ మొదలైంది. కాంగ్రెస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ తమకనుకూలంగా వాడుకుంటూ కాంగ్రెస్ దేశ భద్రతను తేలికగా తీసుకుందంటూ విమర్శిస్తోంది.

భద్రతా నిపుణులు మాత్రం ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మక సమస్యలను బయటపెడుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి దాడులపై కఠిన నిర్ణయాలు అవసరమని సూచిస్తున్నారు.

మొత్తానికి చిదంబరం వ్యాఖ్యలు మళ్లీ 26/11 దాడుల జ్ఞాపకాలను తెరపైకి తీసుకువచ్చాయి. అప్పటి నిర్ణయాలు రాజకీయ, అంతర్జాతీయ ఒత్తిళ్ల ఫలితమేనని స్పష్టమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular