
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు. బీసీసీఐ వైద్య బృందం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించడంతో అతడు చివరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
బుమ్రా లేకపోతే, గత టెస్టులో జట్టులో ఉన్న ఆకాశ్దీప్ మరోసారి తుది జట్టులోకి రానున్నాడు. అతడు సిరాజ్తో కలిసి పేస్ జోడీగా ఇంగ్లాండ్ను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అరంగేట్రం చేసే అవకాశాన్ని అర్ష్దీప్ సింగ్కు కల్పించే అవకాశం ఉంది. బుమ్రా స్థానాన్ని నింపేందుకు అతడికి మంచి అవకాశం లభించనుంది.
స్పిన్ విభాగంలో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నా, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కుతుందా? అనే ఆసక్తి ఉంది. త్రిముఖ స్పిన్ అటాక్ కంటే పేసర్లపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది.
బ్యాటింగ్లో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. సాయి సుదర్శన్ను కొనసాగించే అవకాశం ఉంది. వికెట్ కీపర్గా పంత్ లేకపోవడంతో జగదీశన్ లేదా ధ్రువ్ జురెల్ లో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. భారత్ తుది జట్టులో మార్పులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
