
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి సినిమాలపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రత్యేకంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య మూడోసారి స్క్రీన్ పై కనిపించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్ చక్కర్లు కొడుతోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్లు మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ ఈ విజయవంతమైన కాంబో హ్యాట్రిక్ చిత్రానికి సిద్ధమవుతుందట. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, బాలయ్య ఈ చిత్రంలో మరోసారి డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. బాలయ్య నటనలో డ్యూయల్ రోల్లకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. మొదటి నుంచి ఆయన చేసిన ద్విపాత్రాభినయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్లీ క్రిష్ సినిమాతో ఆ మేజిక్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, స్క్రిప్ట్ పనులు పూర్తయ్యే దశలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. కథకి బాలయ్య స్టైల్ మాస్ హంగులు, క్రిష్ అందించే గ్రాండ్ విజువల్స్ కలిసి సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయని సమాచారం. ప్రస్తుతానికి బాలయ్య అఖండ 2 పూర్తి చేసి, ఆ తర్వాత క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్ మాత్రం క్రిష్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్తో మరోసారి తన మాస్ పరాక్రమాన్ని స్క్రీన్పై చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. త్వరలో అధికారిక సమాచారం రాగానే మరిన్ని డిటేల్స్ తెలియజేస్తాం.
